5/14/2020
0
*భస్మం*

🔱🔱🔱

 కైలాసం నుండి శంకరుడు బ్రాహ్మణుని వేషములో ఒకనాడు రాముడి వద్దకు వెళ్లెను. రాముడు మీ యొక్క నామమును, నివాసమును తెలుపుమని అడుగగా "నా పేరు శంభుడు, కైలాసం నా యొక్క నివాసము" అని రాముడికి చెప్పగా గ్రహించి అతనిని శంకరునిగా గ్రహించి రాముడు వీభూతి యొక్క మహిమను తెలుపవలసినిదని అని అడుగగా శివుడు ఈవిధంగా చెప్పసాగెను...      
 
"రామా...! భస్మమహత్యమును చెప్పుటకు బ్రహాదులకు కూడా శక్యముకాదు. బట్టమీది చారలను అగ్ని కాల్చినట్లు మన నుదుట బ్రహ్మ వ్రాసిన వ్రాతలను కూడా తుడిచివేయగలిగే శక్తి భస్మమునకు ఉన్నది. 

విభూతిని మూడు రేఖలుగా పెట్టుకున్నచో త్రిమూర్తులను మన దేహముమీద ధరించినట్లగును. ముఖమున భస్మమును ధరించినచో నోటి పాపములను (తిట్టుట, చెడు మాటలు పలుకుట అభక్ష్యములను (తినకూడని పదార్థములను) తినడం  అను పాపములు), 
చేతులపై ధరించిన చేతిపాపములను ( కొట్టటం మొదలైనవి), హ్రదయముపై ధరించిన మనఃపాతకములను (దురాలోచనలు మొదలైనవి), నాభిస్తానమున ధరించుట వలన వ్యభిచారాది దోషములను, పక్కలందు ధరించుటవలన పరస్త్రీ స్పర్శ దోషములను పోగొట్టును. 
 
పాపములను బెదిరించి పోగొట్టునది కావున భస్మము అని పేరు దీనికి కలిగెను. భస్మము మీద పడుకొన్నను, తిన్ననూ, ఒంటికి పూసుకున్ననూ పాపములన్ని భస్మీభూతములు అగును, ఆయువు పెరుగును, గర్భిణి స్త్రీలకు సుఖ ప్రసవం కలిగించును, సర్ప వృశ్చికాది దోషములను హరించును, భూత పిశాదులను పారద్రోలును"

వశిష్ట వంశములో ధనంజయుడను  ఒక విప్రుడు ఉండెను అతనికి వందమంది భార్యలు  వందమంది కొడుకులు. వారందరికి తన ధనాన్ని అంతా సమానంగా పంచిఇచ్చి ఆ బ్రాహ్మణుడు గతించెను. కొడుకులు అసూయతోను దురాశతోను ఒకరి ధనము కోసం ఒకరు ఆశపడుచు తన్నుకోసాగిరి. వారిలో కరణుడను కొడుకు శత్రువిజయము సాధించవలెనని గంగా తీరమునకు వెళ్లి స్నానం చేసి తపము చేయవలెననుకొని మునులసేవ చేయుచుండగా ఒక విప్రుడు నృసింహదేవునికి ప్రీతియని ఒక నిమ్మపండుని తెచ్చి అక్కడ పెట్టెను. దానిని వీడు వాసన చూసెను. అందుకు మునులు ఆగ్రహించి ఈగవై పొమ్మని శపించిరి. అతడు వేడుకొనగా పూర్వస్మృతిని ఇచ్చిరి. అంతట ఏడ్చుచూ వెళ్లి జరిగిన విషయం భార్యకు చెప్పెను. అతని భార్య పతివ్రత. చాల విచారించెను. ఒకనాడు  ఈ సంగతి తెలిసి వాని సోదరులు పట్టి చంపిరి. అతని భార్య ఈగ దేహమును తీసుకోని అరుంధతి దగ్గరికి వెళ్లి ప్రార్ధింపగా ఆమె మృత్యుంజయ మంత్రముతో అభిమంత్రితమైన విభూతిని చల్లి కరుణుని బ్రతికించెను. మరొకసారి దాయాదులు కరణుని చంపి యింటి ముందు పరవేసిరి. అతని భార్యయైన శుచిస్మిత భర్త దేహముతో వనములో తిరుగుచుండగా దధీచి ముని కనపడెను ఆమె ఆ మునికి విషయమంతా తెలిపి ప్రార్ధింపగా ఆయన భస్మముతో ఆ బ్రహ్మహత్యా పాపమును పరమశివుడు పోగొట్టెను..., అటువంటి దానినే ఇతనిపై చల్లుచున్నాను అని అతనిపై చల్లెను. అతడు శాప విముక్తుడయి జీవించెను. దేవతలు  కూడా భస్మ ప్రభావమును పొగిడిరి. కరుణ దంపతులు దధీచి మునిని తమ ఇంటికి పిలిచి భోజనం పెట్టిరి. అతడు వారిని దీవించి వెడలిపోయేను. 

ఆవుపేడ పిడుకలను శతరుద్రీయ(నమకము)మంత్రము చెప్పుచు కాల్చి భస్మము చేయవలెను. మంత్రములు రాకున్నచో ప్రణవము ఉచ్చరించుచు ధరింపవలెను. 'ఓం' మంత్రము రానీ వారు ఓం నమశ్శివాయ మంత్రముచే భస్మమును ధరించుట శ్రేష్టం  అని పద్మ పురాణము లో చెప్పబడినది... 🙏🙏🙏

0 comments:

Post a Comment